NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ రైల్వే ప్రాజెక్టుల‌పై చేతులెత్తేసిన కేంద్రం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో రైల్వే ప్రాజెక్ట్లపై కేంద్రం చేతులెత్తేసింది. ఏపీలో రైల్వే ప్రాజెక్ట్లను చేపట్టలేమని రైల్వేశాఖ తేల్చి చెప్పినట్లు సమాచారం. లోక్సభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఏపీలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. రైల్వే ప్రాజెక్టులకు ఏపీ నిధులను కేటాయించడం లేదని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. రూ.1,798 కోట్లు పెండింగ్ నిధులు ఏపీ ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీలో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేమని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

                                 

About Author