PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రైస్తవులను మోసం చేసిన ముఖ్యమంత్రి

1 min read

పథకాలు రద్దు చేసి క్రైస్థవులకు ద్రోహం
టిడిపి క్రిస్టియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు ధ్వజం
పల్లెవెలుగు వెబ్ కడప : క్రైస్తవుల ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి జగన్  క్రైస్తవులను మోసం చేస్తున్నాడని టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాసు ధ్వజమెత్తారు. కడప నగరంలోని  కడప అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రైస్తవులకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాడని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సంక్షేమ పథకాలను తుంగలో తొక్కేశారని అన్నారు. గతంలో క్రైస్తవులు పెళ్లిళ్లు చేసుకుంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  50,000 ఇచ్చే వారన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల ఆరు నెలలు గడుస్తున్న  ఒక్క క్రైస్తవునికి కూడా పెళ్ళికానుక ఇవ్వలేదనన్నారు. క్రైస్తవులు పెళ్లిళ్లు చేసుకుంటే  లక్ష రూపాయలు ఇస్తానని నమ్మించి ముఖ్యమంత్రి జగన్ మోసం   చేసారని మండిపడ్డారు. క్రై స్తువులను మోసం చేసిన జగన్ కు 2024 ఎలక్షన్లో క్రైస్తవులు బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ చదిపి రాళ్ల రమేష్ రెడ్డి, క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఎండి వరప్రసాద్,  కుమార్ రెడ్డి, సుబ్బయ్య పాల్గొన్నారు. 

About Author