PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి  విఆర్ఏ లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..

1 min read

– రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జిల్లాకలెక్టరేట్ వద్ద ధర్నా..

– వైసిపి ప్రభుత్వం అధికారం లోకి రాగానే 15000 వేతనం పంచుతానని హామీ ఇచ్చారు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :    గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీగా తరలివచ్చి సామూహిక నిరాహార దీక్షలో ప్రారంభించారు. దీక్షలను ప్రారంభిస్తున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు. మాట్లాడుతూ 2018 అలంకార్ సెంటర్లో జరుగుతున్న వీఆర్ఏల ధర్నాకు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు  నేటి  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వం అధికారంలోకి రావడంతోటే వీఆర్ఏలకు 15000 జీతం పెంచుతానని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ హామీని నాలుగున్నర సంవత్సరాలైనా నేటికీ అమలు చేయకపోవడం ఆయన మోసకారితనానికి నిదర్శనం అన్నారు. గత ప్రభుత్వంలో వీఆర్ఏలు పోరాడి సాధించుకున్న డి ఎ ను ఈ ప్రభుత్వం వెనక్కి లాగేసుకోవడం హేయమైన చర్య అని ఆయన విమర్శించారు తక్షణమే వీఆర్ఏల నోటి కాడ కూడు లాగేసుకున్న డిఏను వారి అకౌంట్స్ కు  వేయాలని ఆయన డిమాండ్ చేశారు. పే స్కేలును అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షులు బ్రహ్మాజీ మాట్లాడుతూ నామిని వీఆర్ఏలను వీఆర్ఏలుగా గుర్తించాలని నాలుగవ తరగతి ఉద్యోగులుగా అర్హత ఉన్న వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ వీఆర్ఏల శ్రమను ఈ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు తక్షణమే మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు సంఘం జిల్లా కోశాధికారి గంగాధర్ రావు మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన వీఆర్ఏలకు వారి కుటుంబ సభ్యులకు విఆర్ఏ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలు రేపు కూడా కొనసాగుతాయని తెలిపారు ఈ రిలే నిరాహార దీక్షలకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.ఎన్.వి.డి ప్రసాదు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి సోమయ్య అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కే విజయలక్ష్మి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ దీక్షా కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

About Author