PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి

1 min read
చిన్నారి లక్ష్మి పాములేటి ( ఫైల్ ఫోటో )

చిన్నారి లక్ష్మి పాములేటి ( ఫైల్ ఫోటో )

 పల్లెవెలుగు వెబ్​, రుద్రవరం: అభం శుభం తెలియని చిన్నారికి  మూడు సంవత్సరాలకే నూరేళ్లు నిండాయి. ముద్దుముద్దుగా మాటలు పళుకుతూ చిలిపి చేష్టలతో కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తుతున్న చిన్నారి ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన ఘటన మండలంలోని చిత్రేణిపల్లె గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గుమ్మడి పుల్లయ్య, హర్షిత దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు ఆడ పిల్లలు, ఇద్దరు మగ పిల్లలు.

 మంగళవారం సాయంత్రం పుల్లయ్య వరి ధాన్యం తరలించేందుకు వరికోత యంత్రం వద్దకు ట్రాక్టర్​ను రివర్స్ చేస్తుండగా చిన్నారి లక్ష్మీ పాములేటి ట్రాక్టర్ కిందకు వెళ్లిందని, ఆ సమయంలో ఎవరూ గమనించలేదని గ్రామస్తులు తెలిపారు. తండ్రి కూడా ట్రాక్టర్​ను రివర్స్​ చేసే సమయంలో గమనించకపోవడంతో లక్ష్మీ పాములేటి ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు వెల్లడించారు.  చిన్నారి మృతదేహం వద్ద తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ సంఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన గ్రామస్తులను కన్నీటిపర్యాంతం చేసింది.

About Author