NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎంను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం ముఖ్యమంత్రి హిమంత్‌ భిశ్వశర్మను వెంటనే బర్త్‌రఫ్‌ చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అసోం సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం భువనగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఎంపీతోపాటు కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఓ ఎంపీపై సంస్కారం లేకుండా, భారతీయ సంస్కృతిని మరచిపోయి సీఎం స్థాయి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని తెలిపారు. హేమంత్‌భిశ్వశర్మ కాంగ్రెస్‌ పార్టీలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగి, కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీలో చేరారని తెలిపారు.

                                       

About Author