PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన కలెక్టర్​

1 min read

మరిన్ని అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈనెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఢిల్లీ వేదికగా జరిగిన నాల్గవ అంతర్జాతీయ వాకో ఇండియా కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ కిక్ బాక్సింగ్ పోటీలు జాదవ్ ఇండోర్ స్టేడియం ఇంద్ర గాంధీ కాంప్లెక్స్ న్యూ ఢిల్లీలో  జరిగాయి ఇందులో మొత్తం 20 దేశాలు పాల్గొన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి  మొత్తం 28 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొన్నరు. అందులో 24 మంది క్రీడాకారులకు పథకాలు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి  క్రీడాకారులు 3 బంగారు 9 వెండి పథకాలు 12 కాంస్య పథకాలు రావడం జరిగింది. అందులో మన కర్నూలు జిల్లాకు చెందిన త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ  క్రీడాకారులు  సీనియర్ విభాగంలో గుర్రం జయ కళ్యాణ్ పాయింట్ ఫైవ్ ఈవెంట్లో 69కేజీ  వెయిట్ విభాగంలో వెండి మెడల్  మరియు గుర్రం హరి కళ్యాణ్ రింగ్ ఫైట్ లౌ కిక్  75 కే/జీ  విభాగంలో వెండి మెడల్ మరియు ఉప్పరి ఉపేంద్ర పాయింట్ ఫైటు 63 కే/జీ విభాగంలో కాంస్య మెడల్ మరియు జూనియర్ కేటగిరి విభాగంలో బొడ్డు బోయిన ఈశ్వర్ పాయింట్ ఫైవ్  63 కే/జీ విభాగంలో వెండి మెడల్ కిట్ లైట్ విభాగంలో 63 కేజీ విభాగంలో వెండి మెడల్ సాధించారు. వీరిని కర్నూలు జిల్లాకు పథకాలు సాధించిన అందరిని మరియు కోచ్ నరేంద్రను జిల్లా కలెక్టర్ శ్రీ పి రంజిత్ భాష  వీరిని అభినందించారు. మరిన్ని అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించి కర్నూలు జిల్లాకు మంచి పేరును తీసుకురావాలని క్రీడాకారులను సర్టిఫికేట్ మెడలు ఇచ్చి అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *