PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని  గెలిపించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: గౌరవనీయులైన. కాబోయే దేశ ప్రధాని ప్రియతమ నేత శ్రీ రాహుల్ గాంధీ  భారత్ జూడో యాత్ర అక్టోబర్ 18 కి ఒక సంవత్సరం అయింది కాబట్టి ఈ శుభ సందర్భంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైన శ్రీ బాబు  ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ సిడి మాయప్పన్. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన శ్రీ గిడుగు రుద్రరాజు  నంద్యాల్ డిసిసి నాగు మధు. ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులు డిసిసి కార్యదర్శి లు మంత్రాలయం నియోజకవర్గం లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైన శ్రీ గిడుగు రుద్రరాజు  మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మీరందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మన ఉద్దేశం కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ చేయడమే అని ఆయన అన్నారు. భారత్ జోడోయాత్ర దీని ముఖ్య ఉద్దేశం భిన్నత్వంలో ఏకత్వం అని మన ప్రియతమ నేత అందరూ కలిసిమెలిసి ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా పాల్గొని. ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జ్ అయిన సిడి మాప్పన్ గారికి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులైన గిడుగు రుద్రరాజు గారికి. రాష్ట్ర ఉపాధ్యక్షులైన సుధాకర్ బాబుకి కర్నూలు జిల్లా అధ్యక్షులైన బాబురావుకి శాలవాలు వేసి పూలమాలతో వారిని సన్మానించడమైనది. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

About Author