NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ ఎమ్మెల్యే సహకారం మరువలేము

1 min read

– రోజా వీధి ముస్లిం మైనారిటీ నాయకులు
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి గారు తమ సమాజనికి వెలకట్టలేని సహాయం చేసారు అని రోజా వీధిలోని జిలాని మరియు ఇతర మైనారిటీ నాయకులు దాదాపు 150 మంది అన్నారు. తమ ఆహ్వానం మేరకు రోజా వీధికి తేనిటీ విందుకు విచ్చేసిన ఎస్ వి మోహన్ రెడ్డి గారికి పూర్తి సంఘీభావం తెలియచేసారు. బృంద నాయకుడు జి లాని తెలిపారు. అనేక మజీద్ లకు దర్గాలకు నిధులు మంజూరు చేయించారు అని తెలిపారు. ఇంతే కాక అనేకమంది కి ముక్యమంత్రి సహాయనిధి నుంచి చాలా మందికి వైద్య సహాయం చేయించారు అని తెలిపారు. ఇంత సహాయం చేసిన అయన పట్ల తమ సమాజము కృతజ్ఞత కలిగి ఉంటుంది అని తెలియ చేసారు. కార్యక్రమం లో భారీ ఎత్తున వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author