PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వంట బాగాలేద‌ని మంట‌ల్లో వేశారు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : వంట బాగా చేయ‌లేద‌న్న కార‌ణంగా ఉత్తర ఆప్గన్ కు చెందిన ఓ మ‌హిళను మంటల్లో వేశార‌ని నజ్లా ఆయుబీ అనే మ‌హిళా జడ్జి తెలిపారు. స్కై న్యూస్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఆహారం అందించాల‌ని ఆప్ఘాన్ మ‌హిళ‌ల్ని తాలిబన్లు ఒత్తిడి చేస్తున్నార‌ని అన్నారు. యువ‌తుల్ని చెక్క పెట్టెల్లో బంధించి సెక్స్ బానిస‌లుగా మార్చేందుకు ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నార‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు. తాలిబ‌న్ ఫైట‌ర్లకు స్థానికంగా ఉన్న యువ‌తుల్ని ఇచ్చి వివాహం చేయాల‌ని ఒత్తిడి చేస్తున్నార‌ని న‌జ్లా ఆయూబీ తెలిపారు. ఇన్ని దారుణాలు చేస్తూ.. మ‌రోవైపు మ‌హిళ‌లు స్వేచ్చగా ప‌నిచేసుకోవ‌చ్చని బూట‌క‌పు హామీలు ఇస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. తాలిబ‌న్ల పాల‌న‌లో జీవించ‌డం క‌ష్టమ‌ని తాను పారిపోయి వ‌చ్చాన‌ని తెలిపారు. మ‌హిళా జ‌ర్నలిస్టుల‌ను విధుల్లోకి వెళ్లకుండా తాలిబ‌న్లు అడ్డుకుంటున్నార‌ని ఇప్పటికే ప‌లువురు మ‌హిళా జ‌ర్నలిస్టు త‌మ గోడు వెళ్లబోసుకున్నారు.

About Author