PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవినీతి వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి             

1 min read

పత్తికొండ నియోజకవర్గ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ శ్యాం కుమార్ ప్రజలకు పిలుపు                                                                   

పల్లెవెలుగు వెబ్  పత్తికొండ:   జగన్మోహన్ రెడ్డి పాలన పూర్తిగా అవినీతిమయమైందని ఈ ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టాలని పత్తికొండ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రకటించిన  బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారెంటీ ( సూపర్ 6)”  మేనిఫెస్టో కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు శుక్రవారం క్రిష్ణగిరి మండలం లక్కసాగరం పంచాయితీ లల్మాన్ పల్లి గ్రామంలో విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టారు. మొదటగా లక్కసాగరం పంచాయితీ లల్మాన్ పల్లి గ్రామంలో గ్రామ శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ దేవతను దర్శించుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ” (బాబు ష్యూరిటి-భవిష్యత్ గ్యారెంటీ (సూపర్ 6)” కార్యక్రమంలో భాగంగా  పత్తికొండ  నియోజకవర్గం, క్రిష్ణగిరి మండలం  లక్కసాగరం పంచాయితీ లల్మాన్ పల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ &బీజేపీ& జనసేన పార్టీల శ్రేణులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కేఈ.శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, మహిళ, రైతు, యువత, వెనుకబడిన తరగతుల సాధికారత కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాగా పని చేయాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోను రూపొందించారని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పేదలను ధనికులుగా తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ మరియు తెలుగుదేశం పార్టి.

About Author