NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశం అభివృద్ధి చెందుతోంది.. : డా. పార్థసారధి

1 min read

పల్లెవెలుగు వెబ్​: దేశప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారతదేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి.  గురువారం రాజస్థాన్​ లోని జోధ్పూర్​లో  మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి సమావేశాన్నిఉద్దేశించి మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వంఅమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, కానీ కొన్ని రాష్ట్రాలు సహకరించడంలేదన్నారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా డా. పార్థసారధి పిలుపునిచ్చారు. సమావేశానికి ముందు కార్యకర్త ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు.

About Author