PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ద్వేషంతో దేశం బ‌ల‌హీనమ‌వుతోంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ద్వేషం, హింస, అందర్నీ కలుపుకొని వెళ్లకపోవడం వల్ల మన ప్రియతమ దేశం బలహీనమవుతుందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా నాలుగు రాష్ట్రాలలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంపై రాహుల్ ఓ ట్వీట్‌లో స్పందించారు. ద్వేషం, హింస, ఎక్స్‌క్లూజన్ వల్ల దేశం బలహీనపడుతుందని, సౌభ్రాతృత్వం, శాంతి, సామరస్యాలే ప్రగతికి దోహదపడతాయని అన్నారు. సమ్మిళిత భారత్ కోసం ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలని ఆయన కోరారు.

                                

About Author