PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రశాంతంగా ముగిసిన యుగళం పాదయాత్ర

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి మండల పరిధిలోని డి.రంగాపురం నుండి ఎస్.రంగపురం వరకు యువ గల పాదయాత్ర నారా లోకేష్ శనివారం నాటికి ప్రశాంతంగా ముగిసింది. 71 రోజులు కాను 909 కిలోమీటర్లు డోన్ నియోజకవర్గం లోని ప్యాపిలి మండలంలో నారా లోకేష్ యువగల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం కలుచట్ల ,ఎస్ రంగాపురంలో గ్రామాల్లో పాదయాత్ర చేపట్టి పత్తికొండ నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జ్ కేఇ.శ్యామ్ బాబు కు భధ్యతలు అప్పగించారు. అంతకు ముందు గ్రామల మిదుగా పాదయాత్ర కు ప్రజలు స్వాగతం పలుకుతూ పూలదండలతో ముంచ్చి ఎత్తారు, అలాగే తమ గ్రామంలోని సమస్యలు నారా లోకేశ్ కు వినతి పత్రం అందజేశారు. ప్యాపిలి మండలంలో మూడు రోజులగా పాదయాత్రకు గ్రామ ప్రజలు టిడిపి నాయకులు, కార్యకర్తలు అడుగున నీరాజనాలు తెలిపారు, ఈ యువగల పాదయాత్ర డోన్ ఇంచార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర ప్రశాంతంగా జరిగిందని నారా లోకేష్ ధర్మవరం సుబ్బారెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లె టీడీపీ ఇన్చార్జి బీసీ జనార్దన్ రెడ్డి ,ఆళ్లగడ్డ టిడిపి ఇన్చార్జి భూమా అఖిలప్రియ, తదితరులు ప్రజా ప్రతినిధులు టిడిపి నాయకులు ,కార్యకర్తలు ,ప్రజలు అభిమానులు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

About Author