PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ‌ర‌ద‌లో కొట్టుకుపోయిన విలేక‌రి మృత‌దేహం ల‌భ్యం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వరద బాధితులకు అందించే సాయంపై వార్తల సేకరణకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో గల్లంతైన విలేకరి జమీర్‌(36) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం బోర్నపెల్లి సమీపంలో వరదలో రైతులు చిక్కుకున్న సంఘటనను కవర్‌ చేసేందుకు టీవీ జర్నలిస్టు అయిన జమీర్‌ ఈ నెల 12న వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో కారుతో సహా వరదలో గల్లంతయ్యారు. జమీర్‌ స్నేహితుడు ఇర్షాద్‌ ఈ ప్రమాదం నుంచి బయటపడగా.. కారుతో సహా జమీర్‌ కొట్టుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రామాజీపేట సమీపంలో కారును గుర్తించి బయటికి తీశారు. అక్కడికి సమీపంలోనే అతడి మృతదేహం లభించింది.

                                       

About Author