PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీతోనే…బీసీల అభ్యున్నతి..

1 min read

ఉమ్మడి కర్నూలు జిల్లా బీసీ సెల్​ రీజనల్​ కో ఆర్డినేటర్​ నాగరాజు యాదవ్​

పల్లెవెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పెద్దపీఠ వేసిందని. వైసీపీతోనే బీసీల అభ్యున్నతి సాధ్యమవుతోందన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా బీసీ సెల్​ రీజనల్​ కో ఆర్డినేటర్​ నాగరాజు యాదవ్. సంక్షేమం..అభివృద్ధే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిందని, అందులో ఎక్కువ పథకాలకు బీసీలవేనన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్​ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్​ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు శాలువా కప్పి , పూలబొకే అందజేశారు. అనంతరం నాగరాజు యాదవ్​ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుని.. సంక్షేమ పథకాలు వర్తింపజేస్తోందన్నారు. ఆ తరువాత ఎమ్మెల్యేలతో బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతతోపాటు బీసీ కమిటీలపై చర్చించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పోస్ట్ ప్రసాద్ , బీసీ నాయకులు ఉన్నారు.

About Author