PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ప్రభుత్వంలోనే కర్నూలు నగర అభివృద్ధి

1 min read

– 2వార్డ్ 4సచివాలయం పరిధిలో హైదర్సా గేట్,మధువ వీధి లో కొనసాగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సంక్షేమ పథకాలు ఇస్తూ పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన వార్డ్ ప్రజలు.గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారికి వార్డ్ ఇంచార్జి ఫైరోజ్ గారికి వార్డ్ నాయకులు ఘనంగా స్వాగతంఈరోజు ఉదయం కొనసాగిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అమలు చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు అన్నారు. ఆదివారం ఉదయం కర్నూలు నగరంలోని 2వ వార్డ్ 4వ సచివాలయం పరిధిలోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం వైసిపి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మన కు మన ప్రభుత్వానికి జగనన్నని ఆశీర్వదించాలని కోరారు.అలాగే స్థానిక వార్డు ప్రజలు ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికి జగనన్న పరిపాలనలోనే సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అన్నారు. వీధిలో ఉన్న డ్రైనేజీ, మురికి కాలువల సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే  సనుకూలంగా స్పందించి సమస్యలను తీర్చేందుకు మున్సిపాలిటీ సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో వార్డ్ ఇంచార్జి జిల్లా వాక్ఫ్ బోర్డు మెంబెర్ ఫైరోజ్ గారు,వైస్సార్సీపీ వార్డ్ నాయకులు చంద్ బాషా గారు,అనురాధ గారు,మోహన్ కుమార్ గారు, హీరో కుమార్, రవి ప్రకాష్ గారు, హుస్సేన్ గారు, హకీమ్ భాయ్ గారు,సాహెబ్ గారు, ఇక్బాల్ గారు, షబ్బీర్ ఖాన్ గారు,అస్లాం బాషా గారు,వెంకట్ గారు,మరియు ఎలక్ట్రికల్ ఎ.ఈ నాగరాజ్ గారు,ఎ.ఈ రసూల్ గారు, లైటింగ్ సూపరింటెండెంట్ జగదీష్ గారు,ఆర్.పి లు, సచివాలయం సిబ్బంది, అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author