NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాన్ఫరెన్స్ హాల్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కలెక్టరేట్ లో  పునర్నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ ను సోమవారం జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ప్రారంభించారు.కలెక్టరేట్‌ మొదటి అంతస్తులో  కాన్ఫరెన్స్ హాల్ ను ప్రారంభించిన అనంతరం జాయింట్‌ కలెక్టర్‌, మునిసిపల్ కమిషనర్ భార్గవ్ తేజలతో కలిసి కాన్ఫరెన్స్ హాల్ ను కలెక్టర్ పరిశీలించి  సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన  మునిసిపల్ కమిషనర్ ను అభినందించారు.  తదనంతరం కాన్ఫరెన్స్ హాల్ లో   స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమంలో డిఆర్ఓ నాగేశ్వరరావు, ఆర్డీవో హరిప్రసాద్, సిపిఓ అప్పలకొండ, జడ్పీ సీఈవో నాసర రెడ్డి, డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి తదితర జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

About Author