NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈవిఎం గోడౌన్ లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

1 min read

– జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఈవిఎం గోడౌన్ లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన పరిశీలించారు.శుక్రవారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవిఎం గోడౌన్ లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన,డిఆర్ఓ నాగేశ్వరరావు .తో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టరేట్ లోని ఈవిఎం గోడౌన్ లను మరియు స్ట్రాంగ్ రూమును ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పరిశీలించడం జరుగుతుందని అందులో భాగంగా ఈ రోజు కూడ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డిఆర్వో నాగేశ్వరరావు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ మురళి, TDP, BJP, BSP, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు ఎన్నికల సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

About Author