NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్ఫూర్తి దాయకంగా నిలవాలి… జిల్లా కలెక్టర్

1 min read

పల్లవెలుగు , వెబ్​ కర్నూలు : జాతీయ స్థాయిలో జరిగిన క్రీడల్లో రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన ఏఎస్.పర్విజ్ ను ఈరోజు కలెక్టర్ ఛాంబర్ నందు శాలువతో సన్మానించి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుజరాత్ లో అక్టోబర్ 7వ తేది నుంచి 11వ తేది వరకు జరిగిన జాతీయ సాఫ్ట్ బాల్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బ్రాంజ్ మెడల్ సాధించిన ఏఎస్.పర్విజ్ శాలువతో సన్మానించి ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి జిల్లాలోని క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని, అలాగే తల్లిదండ్రులు కూడా క్రీడలలో ప్రతిభను కనబరిచిన క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రభుత్వం కూడా దీనికి ఎంతో సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ విజయానికి కారణమైన వారందరినీ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో సెట్కుర్ సీఈఓ పివి రమణ, కోచ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author