PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపవాస దీక్షతో దైవశక్తి ప్రసన్నం

1 min read

ఇఫ్తార్ విందులో సాయినాథ్ శర్మ

ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్థులు

పల్లెవెలుగు వెబ్ కమలాపురం :  పవిత్ర రంజాన్ కఠిన ఉపవాస దీక్షతో దైవశక్తి ప్రసన్నం అవుతుందని కమలాపురం నియోజక వర్గం ప్రజా నాయకుడు వైసీపీ నేత కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ ఆన్నారు. కమలాపురం మండలం పెద్ద చెప్పలి గ్రామంలో ముస్లిం మైనారిటీ లు ఆదివారం సాయంత్రం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం లో ముస్లిం సోదరులు సోదరీ మణులు చేపట్టే కఠిన ఉపవాస దీక్షల వల్ల దైవ శక్తి గ్రామమంతా వ్యాపిస్తుందని దీని కారణంగా గ్రామంలో శివ ఫలితాలు ఏర్పడుతాయన్నారు.. కులమతాల కతీతంగా చాలా ప్రాంతాలలో దీక్షలు నిర్వహిస్తారన్నారు.. ఉపవాస దీక్షల వల్ల ప్రజల్లో భక్తి భావం ఆధ్యాత్మికత పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు షేక్ గౌస్ ఆజాం MPTC ఆచారి నాగరాజా ,షుకూర్ మహమ్మద్ గౌస్, హాసన్ మహారాజ్, సుంకర మహబూబ్బాషా, సుంకర మహ్మద్ గౌస్ శంకర భాష,మహమ్మద్ గౌస్, మెకానిక్ భాష ,చాంద్ బాషా, ఖాదర్బాషా, జిలాని, షేక్షావలి, సుంకర భాష, దూద్ పిర్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.

About Author