PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీపనగండ్లలో శిథిలావస్థలో త్రాగునీటి ట్యాంక్

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామంలో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ త్రాగునీటి ట్యాంకు ను ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,ఈఓ ఆర్డి ఫక్రుద్దీన్ సోమవారం పరిశీలించారు.త్రాగునీటి ట్యాంకు శిథిలావస్థలో ఉందని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మరియు ఉపాధ్యాయులు ఎంపీడీవో కు వినతిపత్రం ఇచ్చారు.ఈ మేరకు ట్యాంకును పరిశీలించినట్లు ఈవోఆర్డీ తెలిపారు.ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నూతనంగా త్రాగునీటి ట్యాంక్ మంజూరు కొరకు ఏఈ ఎస్టిమేషన్ నివేదికను తయారు చేసి మాకు ఇస్తే ట్యాంక్ మంజూరు కొరకు ఎంపీడీవో కలెక్టర్ గారికి ఈఓఆర్డి జిల్లా పంచాయతీ అధికారికి నివేదికను పంపిస్తామని ఈఓఆర్డి తెలిపారు.తర్వాత నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రాన్ని వారు పరిశీలించి పనులు నాణ్యతగా ఉండాలని అదేవిధంగా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భారతి,గ్రామ వైసీపీ నాయకులు తిమ్మారెడ్డి,పంచాయితీ కార్యదర్శి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author