PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యా కమిటీ పాఠశాల అభివృద్ధికి పాటుపడాలి

1 min read

– సర్పంచ్ ప్రవీణా రెడ్డి
పల్లెవెలుగు వెబ్​,పత్తికొండ : నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని గ్రామ సర్పంచ్ ప్రవీణ రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని దేవనబండ గ్రామం లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రుల విద్యా కమిటీ ఎన్నిక అయింది. ఈ ఎన్నికలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొత్తపల్లి సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగాయి. తరగతికి ముగ్గురు చొప్పున 15 మంది కమిటీ సభ్యులను పిల్లల తల్లిదండ్రులు ఎన్నుకున్నారు. ఎన్నికైన 15 మంది సభ్యుల లో నే నూతన కమిటీ చైర్మన్ గా రాఘవేంద్ర రెడ్డి, వైస్ చైర్మెన్ గా కొట్టాల జ్యోతి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రవీణ రెడ్డి వైసీపీ నాయకులు గాంధీ రెడ్డి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను సభ్యులను సన్మానించారు. ఎన్నికైన నూతన కమిటీ నిరంతరము పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడాలని గ్రామ సర్పంచ్ ప్రవీణ రెడ్డి సూచించారు. పాఠశాల మౌలిక వసతుల కోసం కృషి చేయాలని ఆమె కోరారు. పిల్లల తల్లిదండ్రులు ఎన్నికైన నూతన కమిటీ సమన్వయంతో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ నరసప్ప, కాశన్న పాఠశాల ఉపాధ్యాయులు నాగేటి ప్రసాదు, లలిత మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

About Author