PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోరాటాలతోనే విద్యా వ్యవస్థను కాపాడుకోవాలి

1 min read

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌ శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు
పల్లవెలుగు, వెబ్​ కర్నూలు: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ప్రణవ్ గోపాల్ గారి ఆధ్వర్యంలో జరిగిన రివ్యూ సందర్భంగా టి ఎన్ ఎస్ ఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ రామాంజినేయులు టి ఎన్ ఎస్ ఎఫ్ కార్యక్రమాల పై చర్చించడం జరిగింది.టి ఎన్ ఎస్ ఎఫ్ బలోపేతం పై కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది.టి ఎన్ ఎస్ ఎఫ్ కర్నూలు జిల్లా పోరాటాలను ఉదృతం చేస్తూ రానున్న రోజుల్లో విద్యార్థుల కోసం మరింత బలంగా పోరాడాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు అండగా ఉంటారని తెలిపారు.కర్నూలు జిల్లా లో తెలుగుదేశం పార్టీ పై మరియు టి ఎన్ ఎస్ ఎఫ్ పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు సమీక్షించారు.విద్యార్థులు పోరాటాల తోనే విద్యా వ్యవస్థను బాగు చేసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి వల్ల ఎందరో విద్యార్థులు విద్యకు దూరం అయ్యారని మేన మామ గా ఉంటాను అన్న ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కంస మామ గా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతు ఆత్మ హత్యలకు కారణమవుతున్నారని ఎయిడెడ్ విద్యా వ్యవస్థ నుండి పీజీ విద్యను వరకు విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమం లో ఆదోని నియోజకవర్గ ఉపాధ్యక్షులు శ్రీ రాజ రత్నం మరియు వివిధ పార్లమెంట్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.

About Author