PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెద్దస్వాములును కఠినంగా శిక్షించాలి

1 min read

– వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD )
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కర్నూలు జిల్లా కల్లూరు మండలం కె.నాగలాపురం గ్రామానికి చెందిన ఓ వికలాంగురాలిపై అదే గ్రామానికి చెందిన పెద్దస్వాములు అనే వ్యక్తి మూడు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడని, అతడిని కఠినంగా శిక్షించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్​పీఆర్​డీ) నాయకులు డిమాండ్​ చేశారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్​ ముందు గాంధీ విగ్రహం వద్ద దివ్యాంగుల సంఘాలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD ) జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను అమలు చేయాలని డిమాండ్​ చేశారు. అత్యాచారానికి గురైన దివ్యాంగురాలికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ విజయ కు వినతిపత్రం అందజేశారు. ధర్నా కార్యక్రమంలో జిల్లా నాయకులు అభిలాష్​, రామాంజనేయులు, ఎన్​పీర్​డీ రమేష్​, కె. మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

About Author