PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగులకు ఏ నెల జీతం ఆ నెల అందడం లేదు !

1 min read

పల్లెవెలుగువెబ్ : రాష్ట్రంలోని విలేజ్ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 లక్షల 30 వేల మందికి ఏ నెల జీతం ఆ నెల చెల్లించడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. నవంబర్ నెల 9వ తేదీ వచ్చినా రాష్ట్ర ఉద్యోగులకు 30 శాతం మందికి ఇంతవరకు జీతాలు రాలేదని చెప్పారు. పోలీసు, హెల్త్ డిపార్టుమెంట్లు తప్ప టీచర్లకు, మున్సిపల్, గ్రాంటిన్ ఎయిడ్ ఉద్యోగులకు ఇంతవరకు పెన్షన్లు రాలేదని, ఎప్పుడొస్తాయో తెలియదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలల నుండి జీతాలు లేవని అన్నారు.

About Author