NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కృష్ణారెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం

1 min read

– రాయచోటి పట్టణ సీఐ. సుధాకర్ రెడ్డి మరియు డాక్టర్ భాస్కర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: శ్రీ కృష్ణారెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు దేవేంద్ర రెడ్డి, జ్ఞానెంద్ర రెడ్డిలు ఏర్పాటు చేసిన చలివెంద్రాన్ని పట్టణ సి ఐ సుధాకర్ రెడ్డి మరియు డాక్టర్ భాస్కర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జిల్లా వ్యాప్తంగా వేసవిలో పలు సమస్యల పై ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారి దాహార్థిని తీర్చడమే లక్ష్యమన్నారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రయాణికులు,ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో మరికొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని దాతలు తెలిపారు. .ప్రజలకు సేవచేయుటకు శ్రీ కృష్ణా రెడ్డి సేవా సంస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తూట్ ఆనంద్, బాల కొండారెడ్డి, శ్రీకృష్ణ ఇంటీరియర్ వర్క్స్ మేనేజర్ రెడ్డయ్య, ధరణి రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author