NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉల్లిపంట‌కు నిప్పు పెట్టిన రైతు.. క‌ర్నూల్లో ఘ‌ట‌న !

1 min read

పల్లెవెలుగు వెబ్​: క‌ర్నూల్లో ఓ రైతు ఉల్లిపంట‌కు నిప్పు పెట్టాడు. గిట్టుబాట ధ‌ర లేద‌ని ఆగ్రహించిన రైతు ఈ చ‌ర్యకు పాల్పడ్డాడు. ఈ ఘ‌ట‌న క‌ర్నూలు వ్యవ‌సాయ మార్కెట్లో చోటుచేసుకుంది. పంచ‌లింగాల‌కు చెందిన రైతు వెంక‌టేశ్వర్లు ఉల్లి పంట‌ను క‌ర్నూలు వ్యవ‌సాయ మార్కెట్ కు తీసుకొచ్చాడు. ఈ నామ్ ప‌ద్ధతిలో క్వింటా రూ. 350 ప‌ల‌క‌డంతో ఆగ్రహించిన వెంక‌టేశ్వర్లు ఉల్లి బ‌స్తాల‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.

ఒక్కసారిగా ఉల్లి రేటు ప‌డిపోవ‌డంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. క‌నీసం పంట‌కు పెట్టుబ‌డి కూడ గిట్టుబాటు కావ‌డం లేద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. విష‌యం తెలుసుకున్న అధికారులు క్వింటాకు 700 రూపాయ‌లు ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చారు.

About Author