PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశంలో తొలి ప్రైవేటు రైలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రైలు సర్వీస్‌ ప్రారంభమైంది. ‘భారత్‌ గౌరవ్‌’ పేరు తో ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు తొలి ప్రైవేటు రైలు తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్‌ నుంచి మహారాష్ట్రలోని షిరిడీ సాయినగర్‌కు మంగళవారం సాయంత్రం 6 గంటలకు బయల్దేరింది. దీంతో దేశంలోనే తొలి ప్రైవేటు రైలు సర్వీసును ప్రారంభించిన ఘనత దక్షిణ రైల్వేకి దక్కింది. 20 బోగీలు కలిగిన ఈ రైలును సేలం డివిజన్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ గౌతమ్‌ శ్రీనివాస్‌ ప్రారంభించారు. తొలి రోజే ఈ రైలులో 1,100 మంది ప్రయాణించారు. ఈ ప్రైవేటు రైలు గురువారం ఉదయం 7.25 గంటలకు షిరిడీ చేరుతుంది.

                                       

About Author