PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ చేప ధర రూ.4.30 లక్షలు

1 min read

పల్లెవెలుగువెబ్ : కచ్చిడి చేప మత్స్యకారుడి వలకు చిక్కితే కాసుల పంటే. చాలా అరుదుగా లభ్యమయ్యే ఈ చేప దొరికితే మత్స్యకారులు పండగ చేసుకుంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారులకు అలాంటి పండగే ఇది. ఒక మత్స్యకారుడి వలకు 30కిలోల పైబడి బరువు కలిగిన కచ్చిడి మగ చేప చిక్కింది. చేప కడుపులో ఉండే బ్లాడర్‌కు మంచి గిరాకీ ఉండడంతో ఈ చేప రూ.4.30 లక్షలకు కాకినాడలో అమ్ముడుపోయింది. ఇంత ధర పలకడం ఇదే తొలిసారని వ్యాపారులు తెలిపారు.

       

About Author