PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదే… టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భవిష్యత్తు అంతా తెలుగుదేశం పార్టీదేనని ప్రజలకు తెలిసిపోయిందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. శుక్రవారం రాత్రి 10 :15 గంటల తర్వాత నగరంలోని 5 వ వార్డులోని చిత్తారివీధిలో టిడిపి నేతలు మెహబూబ్ ఖాన్, రమీజ్ ఆధ్వర్యంలో హినయత్, సద్దాం బ్రుందం వైసీపీని వీడి టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా టి.జి భరత్ వీరికి కండువాలు వేసి టిడిపిలోకి ఆహ్వానించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ ప్రజల్లో తెలుగుదేశం పార్టీ బలపడుతోందన్నారు. అందుకే అధికార పార్టీని వీడి టిడిపిలో చేరేందుకు యువకులు ముందుకువచ్చారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనకు, ఈ ప్రభుత్వ నాలుగున్న సంవత్సరాల పాలనకు తేడా ఏంటో ప్రజలందరూ గమనించాలని కోరారు. పన్నులతో పాటు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయాయన్నారు. ప్రజలు ఆలోచించాలని, ఎన్నికల సమయంలో వచ్చి మాయాబజార్ మాటలు చెప్పి మోసం చేసేవాళ్లని ఎప్పటికీ నమ్మకండని భరత్ కోరారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం డెవలప్ అవుతుందన్నారు. ఇక తనకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటానన్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతం రూపురేఖలు మారుస్తానని చెప్పారు. తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రంలో టిడిపి నేతలు బాలు, షఫిఉల్లా, సురేష్, అంజి, కిట్టు, సుశీలమ్మ, లలితమ్మ, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

About Author