PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి తోనే రాష్ట్ర భవిష్యత్తు ఈ ఎన్నికల్లో టిడిపికి పట్టం కట్టండి..

1 min read

పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి.

పల్లెవెలుగు వెబ్ గడివేముల: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ లో భాగంగా పర్యటించి ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు.  తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 ఏళ్లలో వైసీపీ పాలనలో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయారని సంక్షేమ రాజ్యం కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అన్నారు.  రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో వస్తుందన్నారు.  టీడీపీ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాస్ రెడ్డి, మురళీమోహన్ రెడ్డి, గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి, సీనియర్ నాయకులు బిడుదురి సీతారామరెడ్డి, పంట రామచంద్రారెడ్డి దుర్వేసి కృష్ణ యాదవ్, బిలకల గూడూరు ఎస్. ఏ రఫీక్, గని హర్ష, కరిమద్దెల ఈశ్వర్ రెడ్డి, యువ నాయకుడు గంజెర్ల గణేష్ రెడ్డి, ఐ టి డి బి వి ఎన్ రాజు, కొర్రపోలురు జేయన్న, షణ్ముఖ రెడ్డి, ఫారుక్, బిలకల గూడూరు సుదర్శన్ రెడ్డి, ఒడ్డు లక్ష్మీదేవి, సుభద్రమ్మ, బిఎస్ రాంభూపాల్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

About Author