NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువత భవిష్యత్తు బాధ్యత తెలుగుదేశం పార్టీదే..టి.జి భరత్

1 min read

బంగారుపేటలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం

ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టో వివరించిన టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: కర్నూల్లోని యువత భవిష్యత్తు బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 13 వ వార్డు పరిధిలోని బంగారుపేటలో ఆయన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలన్నీ తీరుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలపించాలని కోరారు. తమ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కర్నూల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కేవలం ప్రజాసేవ కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. తాను గెలిస్తే కర్నూలుకు పరిశ్రమలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. టిడిపిని గెలిపిస్తే అభివ్రుద్ది ఉంటుందన్నారు. యువత ఆలోచించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. కర్నూలులో గత పదేళ్ల పాలన ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రజావేదిక సభలో స్థానిక సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు శ్రీనివాస రెడ్డి, సురేష్, పురుషోత్తం, దాము, శేఖర్, భరత్, శివ, మధు, ఏళ్లు, జాన్, బజారి, శేఖర్, సాయి, మద్ది, ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.

About Author