PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిజాబ్ ధ‌రించిన బాలిక ప్ర‌ధాని అవుతుంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హిజాబ్‌ ధరించే బాలిక ఎప్పటికైనా భారతదేశ ప్రధానమంత్రి అవుతుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ట్వీట్‌ చేశారు. బాలికలు హిజాబ్‌ ధరించి తరగతులకు హాజరవడంపై కర్ణాటకలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఒవైసీ ఓ వీడియోను ట్విటర్‌లో ఉంచారు. ‘హిజాబ్‌ ధరించే బాలికలు కాలేజీలకు వెళ్తారు. జిల్లా కలెక్టర్లు, మేజిస్ర్టేట్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు అవుతారు. అది చూడటానికి నేను బతికి ఉండకపోవచ్చు. కానీ నా మాటలు గుర్తుంచుకోండి. హిజాబ్‌ ధరించిన బాలిక ఏదో ఒక రోజున ప్రధాని కూడా అవుతుంది’ అని ఒవైసీ పేర్కొన్నారు.

                                             

About Author