PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిపాజిటర్లకు భరోసా కల్పించడమే లక్ష్యం !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :బ్యాంకింగ్ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలిగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందులో భాగంగానే బ్యాంక్‌ డిపాజిట్లపై ఇప్పటి వరకు ఉన్న రూ.లక్ష బీమా పరిమితిని రూ.5 లక్షలకు పెంచినట్టు తెలిపారు. ఈ చర్య బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుతుందన్నారు. ఢిల్లీలో డిపాజిటర్స్‌ ఫస్ట్‌.. గ్యారంటీడ్‌ టైమ్‌ బౌండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ పేమెంట్‌ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ విషయం చెప్పారు. ‘డిపాజిటర్ల ప్రయోజనాలే ముందు’ అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంస్కరణ తీసుకువచ్చినట్టు తెలిపారు.

About Author