PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

1 min read

చెన్నూరు అరుంధతి నగర్ లో టిడిపి నుండి భారీగా వైఎస్ఆర్సిపిలో యువత చేరిక
పల్లెవెలుగు, వెబ్​ చెన్నూరు: పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి అన్నారు, ఆదివారం సాయంత్రం చెన్నూరు అరుంధతి నగర్ కు చెందిన పాఠశాల చైర్మన్ బి, పద్మావతి సురేష్ దంపతులతో సహా యువకులు, మహిళలు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ పార్టీలో చేరడం జరిగింది, వీరందరిని కూడా ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి పార్టీలోకి సాధారoగా ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరడం, అదేవిధంగా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి వారికి అన్ని విధాల చేదోడువాదోడుగా ప్రభుత్వం చేయూత ఇవ్వడం జరిగిందన్నారు, నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాల ల రూపురేఖలే మార్చడం జరిగిందన్నారు, అంతేకాకుండా నవరత్నాల తో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు, గ్రామాలలో ఏవైనా ఇంకా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రభుత్వమే ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు… ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాల తో ఆకర్షితులై వైయస్సార్ సిపి పార్టీ లో చేయడం జరిగిందని , అలాగే ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అడగగానే అన్ని పనులు చేసి పెడుతున్నారని, ఆయన నాయకత్వంలో పార్టీలో చేరడం ఆనందంగా ఉందని పార్టీలో చేరిన పాఠశాల కమిటీ చైర్మన్ పద్మావతి అన్నారు ,, గ్రామ అభివృద్ధి జరగాలంటే వైయస్సార్ సిపి పార్టీ లో చేరడం ఉత్తమమని భావించి యువకులం మహిళలు పెద్ద ఎత్తున పార్టీలో చేరమని అరుంధతి నగర్ వాసులు తెలిపారు, గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తమకు అందుతున్నాయని ఇంతకంటే ఇంతకంటే గొప్ప పాలన ఇంకెక్కడ ఉంటుందని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పెడబల్లి ప్రతాపరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గణేష్ రెడ్డి, వైయస్సార్ వైఎస్సార్ సీపీ యువ నాయకులు పెడబల్లి ప్రదీప్ కుమార్ రెడ్డి , మండల కో ఆప్షన్ నెంబర్ వారిస్, ఎంపీటీసీలు సాధిక్ అలీ, చంద్రశేఖర్, తో పాటు పార్టీలో చేరిన వారు, కిట్టు ,చక్రి ,మురళి ,హరి, సుబ్బరాయుడు, వెంకటసుబ్బయ్య.

About Author