NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌నం చనిపోతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జంగారెడ్డిగూడెం మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేన‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. కల్తీసారా కారణంగా బాధితులు చనిపోతున్నారని చంద్రబాబు ఆరోపించారు. రేపు పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. జంగారెడ్డిగూడెం ఘటనలో మృతుల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. పదుల సంఖ్యలో జనం చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణాలపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని, స్థానికంగా ఉన్న భయాందోళనలను పొగొట్టాలని చంద్రబాబు అన్నారు. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

                                        

About Author