PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాత్రికి రాత్రే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించిన ప్రభుత్వం

1 min read

– స్పందించిన ఏపీ రైతు సంఘం

పల్లెవెలుగు వెబ్ గడివేముల: రాత్రికి రాత్రే దొంగల్లాగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించారని ఏపీ రైతు సంఘం నంద్యాల జిల్లా కార్యదర్శి ఏ. రాజశేఖర్ అన్నారు. గడివేముల మండలంలోని గడివేములలో గత వారం రోజుల నుండి రైతులకు తెలియకుండా, రైతుల అభిప్రాయ సేకరణ లేకుండా రాత్రికి రాత్రే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించారని ఇది చాలా దారుణం అని ఆయన అన్నారు. ఆదివారం నాడు గడివేముల మండల కేంద్రంలోని పొలాల్లో బిగించిన మీటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ మీటర్లు బిగించడం దారుణమని వెంటనే మీటర్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు, లేనిపక్షంలో రాబోవు రోజుల్లో రైతులతో కలిసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఇలాంటి పిరికి పందె చర్యలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం దారుణమని అన్నారు. వర్షాలు లేక ప్రాజెక్టులలో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో నక్క మీద తాటికాయ పడినట్టు మీటర్లు బిగించి రైతుల నడ్డి విరుస్తున్నారని, ప్రభుత్వం వెంటనే విరమించుకొని వ్యవసాయ మోటార్లకు మీటర్లు తొలగించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున రైతులతో తహసిల్దార్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తానని అన్న డిమాండ్ చేశారు త్వరలో విజయవాడలో రైతులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద స్వామి, గోకారి, మహిళా రైతులు కూలీలు పాల్గొన్నారు.

About Author