PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్మీకులను మభ్యపెడుతున్న ప్రభుత్వం

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : వాల్మీకీ బోయలను వైసీపీ ప్రభుత్వం మభ్యపెతోందని టీడీపీ నాయకులు జిల్లా కార్యదర్శి ప్రభాకర్ నాయుడు, మాజీ సర్పంచ్ రంగముని,బోయ కౌలుట్లయ్య నాయుడు, చెన్నెల రాయుడు, ఎన్ వి బాబు నాయుడు లు అన్నారు.శనివారం టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాల్మీకులను ఎస్టీ జాబితాలో మార్చేందుకు నాలుగు జిల్లాలకు మాత్రమే వర్తించేలా తీర్మానం చేసి కేంద్రానికి పంపడం సరికాదన్నారు.గతం లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రం లో ఉన్న వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అప్పుడే కేంద్రం కు తీర్మానం చేసి పంపిన్నారని గుర్తు చేశారు.ఇప్పుడు రాయలసీమ కే పరిమితం చేయడం సరి కాదని అన్నారు.ఏప్రిల్ రెండవ తేదీ న తలపెట్టిన సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం,ర్యాలీని, వాల్మీకులలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గంజిహళ్లి పెద్ద లక్ష్మన్న,సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

About Author