PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోటీలలో గ్రామ పంచాయతీ వారే పాల్గొనాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ రుద్రవరం: మండల కేంద్రమైన రుద్రవరంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే పారువేట పరుగు పోటీలలో గ్రామ పంచాయతీకి చెందిన వారే పాల్గొనాలని ఆలయ నిర్వాహకుడు ఏరువ కృష్ణమూర్తి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన రుద్రవరం లో వెలసిన శ్రీ భాస్కర నందీశ్వర స్వామి శ్రీ ఆంజనేయ స్వామి గ్రామ సమీపంలో కొలువైన శ్రీ దొరివి నరసింహ స్వామి ఆలయాలకు సంబంధించి సంక్రాంతి పండుగ రోజు యువకులకు పారువేట పరుగు పందాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామ పరిధిలో సాంప్రదాయ బద్దంగా నిర్వహించే ఈ పోటీలలో గ్రామ పంచాయతీ పరిధిలోని రుద్రవరం రెడ్డిపల్లె తువ్వపల్లె గ్రామాలకు చెందిన వారు మాత్రమే పాల్గొనడం జరుగుతుండేదన్నారు. ఇందులో భాగంగా ఆలయ తోటి నిర్వాహకుల సలహా మేరకు గ్రామపంచాయతీకి చెందిన వారు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని పక్క గ్రామాలకు సంబంధించిన వారు ఈ పోటీలలో పాల్గొనరాదని ఆయన తెలిపారు.

About Author