PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్యంత వైభవంగా హనుమత్ వ్రతం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జయ గురుదత్త శ్రీ గురుదత్త  శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహంతో ఈరోజు మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఉపాలయం కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి ఎంతో విశేషంగా అత్యంత వైభవంగా హనుమత్ వ్రతం నిర్వహించడం జరిగింది.ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆంజనేయస్వామికి విశేషంగా మన్య సూక్తం పవమాన సూక్తంతో అభిషేకం జరిగినది. భక్తులందరూ కూడా వారి స్వహస్తాలతో పంచామృత అభిషేకం చేశారు.13 ముళ్ళు కలిగినటువంటి తోరాన్ని ధరించి హనుమత్ కృపకు పాత్రులైరి.హనుమత్ కథను విని భజనలు చేసి ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొంది. అనంతరం తోరాలను తీర్థప్రసాదాలు స్వీకరించిరి…!

About Author