PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొలానికెళ్లిన హీరోయిన్ సాయిప‌ల్ల‌వి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉగాది పర్వదినాన్ని సినీ ప్రముఖులు అంతా అంగరంగ వైభవంగా జరుపుకుంటే.. హీరోయిన్ సాయి పల్లవి మాత్రం మట్టి మనుషులతో కలిసి పొలం దగ్గర ఉగాది వేడుకలు జరుపుకుంది. అంతేకాదు కూలీగా మారి వ్యవసాయ పనులు చేసింది. ఆడవాళ్లు అంతా పొలం పనుల్లో ఉండగా అదే తరహాలో సాయిపల్లవి కూడా రెడీ అయి, వారితో కలిసి పంట కోత పనుల్లో పాల్గొంది. ఈ ఫొటోలను సాయిపల్లవి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ ఫోటో చూసిన అభిమానులు సాయి పల్లవిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నీకంటే అందంగా ఎవరూ ఉండరంటూ కామెంట్‌ చేస్తున్నారు.

                                            

About Author