NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎడమ కాలువను పొడిగించి సాగు, తాగునీరు అందించాలి

1 min read

దేవనబండ లో సంతకాల సేకరణ చేపట్టిన సిపిఐ, ఏపీ రైతు సంఘం నాయకులు

పత్తికొండ, న్యూస్​ నేడు:  పందికోన రిజర్వాయర్ కింద ఉన్న ఎడమ కాలువను పొడిగించి సాగు, తాగునీరు అందించాలని సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మయ్య, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి బి. సురేంద్ర కుమార్ లు డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ, ఏపీ రైతు సంఘం నాయకులు దేవనబండ లో రైతులను కలుసుకొని సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పందికోన రిజర్వాయర్ కింద ఉన్న ఎడమ కాలువ ను పొడిగించి పనులను పూర్తి చేసినట్లయితే 20వేల ఎకరాలకు సాగునీరు, 15 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. ఈనెల 28న గ్రామ సచివాలయం ఎదుట జరిగే ధర్నా కార్యక్రమంలో పార్టీలకతీతంగా రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పెద్ద ఈరన్న, రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి, ఏంగిల్స్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *