NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కన్నీళ్లు పెట్టుకున్న తమిళ హీరో శింబు.. కారణం ఇదే!

1 min read


పల్లెవెలుగు వెబ్: తమిళ హీరో శింబు తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ సినిమా పూర్తి చేశాడు. ఈ చిత్రానికి సంబంధించి సినిమా బృందం చెన్నైలో మీడియాతో ముచ్చటించింది. ‘మానాడు’ చిత్రం ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ‘మానాడు’ పూర్తిగా వినోదభరిత సినిమా అని హీరో శింబు అన్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని.. ఎస్‌జే సూర్య అద్భుతంగా నటించాడని అన్నారు.
అయితే అప్పటి వరకు సరదాగా మాట్లాడిన శింబు… తనను కొందరూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో వేదిక మీద ఉన్న భారతీరాజా, ఎస్ఏ చంద్రశేఖర్, ఎస్‌జే సూర్య, నిర్మాత కె.రాజన్… శింబును ఓదార్చారు. సమస్యలు సృష్టిస్తున్న వారి సంగతి తాను చూసుకుంటానని.. అయితే తన సంగతి మీరు చూసుకోవాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

About Author