PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మీడియా’.. వాస్తవాలు వెలికితీయాలి

1 min read

జెమ్​కేర్​ కామినేని హాస్పిటల్​ జనరల్​ ఫిజిషియన్​ మరియు డయాబెటిస్​, సీఈఓ డా. చంద్రశేఖర్​

  • ‘పల్లెవెలుగు’ క్యాలెండర్​ ఆవిష్కరించిన వైద్యులు
  • కర్నూలు, పల్లెవెలుగు: నిజాన్ని నిర్భయంగా రాస్తే మీడియా రంగం… ఆధునిక టెక్నాలజిని ఉపయోగించి మరింత దూసుకెళ్లాలని సూచించారు జెమ్​కేర్​ కామినేని హాస్పిటల్​ జనరల్​ ఫిజిషియన్​ మరియు డయాబెటిస్​, సీఈఓ డా. చంద్రశేఖర్​. సోమవారం నగరంలోని జెమ్​కేర్​ కామినేని హాస్పిటల్​లో ‘పల్లెవెలుగు’ దినపత్రికకు చెందిన నూతన (2024) క్యాలెండర్​ ను  ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్​ మాట్లాడుతూ అవినీతిని ఎండగట్టి.. నిజాన్ని నిర్భయంగా రాయాలన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, అందులో మీడియా రంగం మరింత వేగంగా దూసుకెళ్తోందన్నారు. సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు చేరుస్తున్న పల్లెవెలుగు దినపత్రిక … టెక్నాలజీ ఉపయోగించి.. మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.  కార్యక్రమంలో జెమ్​కేర్​ కామినేని హాస్పిటల్​ మార్కెటింగ్​ మేనేజర్​ నదీమ్​, సిబ్బంది ఉన్నారు.

About Author