PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెడికల్ క్యాంప్ విజయవంతం

1 min read

– ఉచిత వైద్య శిబిరంలో బుడ్డాకు ప్రజల ఆశీర్వాద వచనాలు
– 360 మందిని పరీక్షించిన వైద్యులు… ఉచితంగా మందులు పంపిణీ
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు : ఒక మంచి మాట మనసుకు ఓదార్పు నిస్తుంది. రోగంతో బాధ పడే వారికి ఒక మందు ఏంతో ఉపశయనాన్ని ఇస్తుంది.పట్నం వెళ్ళి వైద్యులను సంప్రదించడానికి కుటుంబ ఆర్థిక స్థితి సహకరించక పల్లెల్లో ఉన్న వైద్యుల చెంతకు వెళ్లినా రోగం నయం కాక,తాత్కాలిక,దీర్ఘ కాలిక రోగాలతో భాధ పడే వారికి శ్రీశైలం నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరెడ్డి సహకారంతో నంద్యాల శాంతి రామ్ వైద్యుల పర్యవేక్షణలో ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా అధ్వర్యంలో తెలుగు దేశం నాయకులు 5 వ వార్డులో టీడీపీ నాయకులు ఆసీఫ్ బేగ్ ఆద్వరంలో 6 వ వార్డులో టీడీపీ నాయకులు రేడియం నూర్ ఆద్వరంలో మరియ కృష్ణాపురం టీడీపీ నాయకులు శివారెడ్డి, నారాయణ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరం పల్లె మరియు పట్టణ వాసులకు ఎంతో వూరట కలిగించింది. శాంతి రామ్ వైద్యులు డాక్టర్ నవీన్,మానస ,శ్రావిక,సాయి హర్ష పర్యవేక్షణలో 40 మంది సిబ్బందితో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కీళ్ల నొప్పులు,జ్వరం,నరాల బలహీనత,దగ్గు, ఆయాసము సుగర్,గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులను వైద్యులు పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సుగర్ వ్యాధిగ్రస్తులకు రక్త పరీక్షలు గుండె సంబంధిత రోగులకు ఇసిజి, బిపి పరీక్షలు నిర్వహించారు.వ్యాధి తీవ్రతను బట్టి నంద్యాల శాంతి రామ్ వైద్యశాలను సంప్రదించాలని సూచించారు.బుడ్డా రాజశేఖరెడ్డి అందించిన సేవా భావాన్ని దృష్టిలో ఉంచుకొని వృద్దులు ఆశీర్వాద వచనాలు పలికారు.మా ఆయుష్ పోసుకొని నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి అని దీవించారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది శంకర్,శేషు,సుబ్రమణ్యం,మనోజ్,నాయక్,తిమ్మయ్య నూరుల్లా ఫారుక్ హాజి తదితరులు పాల్గొన్నారు.

About Author