NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి ప‌ద‌వి రాలేద‌ని.. ఎంపీటీసీ మంట‌ల్లోకి దూకే య‌త్నం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ విప్‌, పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కేబినేట్‌లో చోటు దక్కకపోవడంతో నియోజకవర్గంలో అలజడి రేగింది. రెంటచింతలలో మహిళా ఎంపీటీసీ సంపూర్ణ మంటల్లో దూకి ఆత్మహత్య యత్నం చేయగా, వైసీపీ కార్యకర్తలు నిలువరించారు. మాచ‌ర్ల‌ పట్టణంలోని బస్టాండ్‌ సెంటర్‌, మాచర్ల-సాగర్‌ రహదారి, మండల కేంద్రమైన రెంటచింతల-గుంటూరు ప్రధాన రహదారిపై టైర్లు తగులబెట్టి మంటలు పెట్టారు. మోటారు బైకును దగ్థం చేశారు. కారంపూడిలో ధర్నా నిర్వహించారు. మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ తురకా కిషోర్‌ సహా మరో 30 మంది కౌన్సిలర్లు పురపాలక సంఘంలో సమావేశమై మూకుమ్మడిగా రాజీనామాలు ప్రతిపాదించారు.

                               

About Author