NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రాలయం ఎంఈఓపై చర్యలు తీసుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​: శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని మంత్రాలయం మండలం లోని సుంకేశ్వరి, షోలహళ్లి, కచాపురం , సుగురు ప్రాథమిక పాఠశాలలు డిపేప్ మెయిన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అకస్మాత్తుగా స్థానిక సెలవు రద్దు చేసిన మంత్రాలయం ఎంఈఓ మొయినుద్దీన్ పై చర్య తీసుకోవాలని హిందూ ఉపాధ్యాయ సమితి డిమాండ్ చేసింది.  మండలంలో శ్రీరామ నవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారని, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించకుండా…  ఆకస్మాత్తుగా సెలవును ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా .. రాత్రి 9 గంటలకు  నిర్ణయం మార్చాల్సిన అవసరం ఏమిటని హిందూ ఉపాధ్యాయ  జాతీయ అధ్యక్షులు మహేష్ డేగల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురువ చంద్రశేఖర్ ప్రశ్నించారు ఇటువంటి విషయాలను తిరిగి పునరావృతం కాకుండా చూడాలని తెలియజేశారు.

About Author