NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘చేనేత’ను ఆదుకున్న ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, నేతన్న కుటుంబాలను ఆదుకొని వారి కష్టాలు తెలుసుకొని నేను ఉన్నాను అని హామీ ఇస్తూ, 48 మంది నేత కార్మికులకు నేతన్న హస్తం మంజూరు చేసిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డికి, రామన పల్లె నేత కార్మికులు శనివారం ఆయన నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలియజేసినట్లు, మడక వెంకటసుబ్బయ్య  తెలియజేశారు, శనివారం మడక వెంకటసుబ్బయ్య, మడక రమణ విలేకరులతో మాట్లాడుతూ ,    మండలంలోని రామన పల్లె గ్రామానికి చెందిన 48 మంది నేత కార్మికులకు నేతన్న నేస్తం మంజూరు కావడం జరిగిందని, అయితే ఇదంతా కూడా పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి చొరవతో నే సాధ్యమైందని ఆయన తెలిపారు, అలాగే నేతన్నల వారందరూ కలసి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మా సీమ బాబు ఆధ్వర్యంలో, కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మడక వెంకటసుబ్బయ్య, తో పాటు మటక వెంకటరమణ, చిన్న సుబ్బన్న, చెంగా నారాయణ, ఉప్పు రవి, శీను, దామోదర్, పోలిశెట్టి వెంకట రమణ, మడక జనార్ధన్, కొమ్మిశెట్టి  శీను, ఉప్పు శ్రీనివాసులు, గ్రామానికి చెందిన నేతలు పాల్గొన్నారు.

About Author