PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్

1 min read

– పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
– ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
– వైఎస్సార్ సీపీ బలపరచిన అభ్యర్థి మధుసూదన్ ను గెలిపిద్దాం
– ఎమ్యెల్యే శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి

పల్లె వెలుగు వెబ్ పాణ్యం గడివేముల: పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, పాణ్యం గడివేముల మండల కేంద్రంలో అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు,ఎంపీటీసీలతో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన సమావేశానికి , పాణ్యం ఎమ్యెల్యే మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు .కాటసాని రాంభూపాల్ రెడ్డి,స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి డా.మధుసూదన్ ముఖ్య అతిథిలుగా హాజరయి ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడారు… ఎమ్యెల్యే శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన డా.మధుసూదన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్ అని ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీ అభ్యర్థి గెలుపు కృషి చేయాలని అన్నారు , మండలంలోని ప్రజాప్రతినిధులు ప్రతీ ఒక్కరూ మన మధుసూదన్ గారికి ఓటు వేసి,వేయించి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ.. జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author