NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది.. ఎమ్మెల్యే

1 min read

– మసీదు అభివృద్ధి కోసం ఎలాంటి సహకారం కావాలన్న అందిస్తాం. కాటసాని
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో రంజాన్ ఇఫ్తార్ విందుకు తనను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని బనగానపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని అన్నారు. పట్టణంలో జిమ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముందుగా రోజా దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. రోజా దీక్ష విరమించిన ముస్లింలందరికీ కాటసాని రామిరెడ్డి ప్రత్యేకంగా భోజనం వడ్డించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట్లాడుతూ రంజాన్ ఉపవాస దీక్షలు ఎంతో గొప్పవన్నారు. జిమ్మ మసీదులో మసీదుతో పాటు ఇతర మసీదుల నుండి వచ్చిన ముస్లింలకు కూడా భోజనాలు ఏర్పాటు చేసిన హమీద్ ను ఆయన అభినందించారు. అల్లా దీవెనలు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక తమ మసీదు అభివృద్ధి కోసం ఎలాంటి సహకారం కావాలన్న అందజేస్తామని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బరాయుడు జావిద్ కిషోర్ సిద్ధం రామ్మోహన్ రెడ్డి డాక్టర్ మహ్మద్ హుస్సేన్ ఇతరులు పాల్గొన్నారు.

About Author